ఘనంగా శిద్ధా ఆధ్వర్యంలో నూతన సంవత్సర వేడుకలు నిర్వహణ – అధిక సంఖ్యలో శుభాకాంక్షలు తెలిపిన ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు

నూతన సంవత్సర వేడుకలను ఆదివారం ప్రజలు ఘనంగానిర్వహించుకున్నారు. అర్ధరాత్రి నూతన సంవత్సర వేడుకలతో యువకులు కేరింతలు కొడుతూ సందడి చేసారు. మహిళలు, ప్రజలు ఎక్కువగా దైవ సన్నిధిలో గడపటానికి ఇష్టపడ్డారు. రాజకీయ నాయకులు ఫలు పార్టీల నేతలను కలుసుకొని శుభాకాంక్షలను తెలిపారు. ఒంగోలులో మాజీ మంత్రి శిద్ధా రాఘవరావు, యువ నాయకుడు శిద్ధా సుధీర్ కుమార్ల నివాసం వద్ద ఏర్పాటు చేసిన నూతన సంవత్సర వేడుకలలో అధిక సంఖ్యలో ప్రజా ప్రతినిథులు, నాయకులు, కార్యకర్తలు, అధికారులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. గజ మాలలతో సన్మానించారు. కేక్ లు కట్ చేసి పంచి పెట్టారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *