పొగాకు తోటలు, గ్రీడింగ్ను క్షేత్ర మిత్ర బృందం (ఎఫ్ఎఫ్టి) పరిశీలించి రైతులకు తగిన సూచనలు చేసారు. ఒంగోలు-2 వేలం కేంద్రం పరధిలోని వెంకట రాజు పాలెం, త్రోవగుంట, చదల వాడ మరియు ఓబన పాలెం గ్రామాలలో పర్యటించి పొగాకు తోటలు, గ్రెడింగ్, క్యూరింగ్ పై రైతులకు అవగాహన కల్పించారు. పొగాకు తోటల్లో పొగ మల్లే, ఆకుముడుత, పచ్చపురుగు సంభవించి ఉన్న విషయాలను గమనించి నివారణకు తగిన సూచనలు చేసారు. వేలం నిర్వాహణాధికారి కోవి రామక్రిష్ణ, ఆర్ఎంఓ ఎ. ఎస్ తులసి తదితరులు పాల్గొన్నారు.




