పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మలను గురువారం విజయవాడలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆపార్టీ ప్రధాన కార్యదర్శి కైపు వెంకట క్రిష్ణా రెడ్డి మర్యాద పూర్వకంగా కలిసారు. జిల్లాలో యువత ఎదుర్కోంటున్న సమస్యలపై, దొనకొండలో పారిశ్రామిక కారిడార్ను ఉపయోగంలోనికి తీసుకువచ్చే విధంగా చెయ్యాల్సిన ప్రయత్నాల గురించి వివరించారు. జిల్లా కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు షేక్ సైదా, సంతనూతలపాడు నియోజక వర్గ ఇన్చార్జి పాలపర్తి విజేష్ రాజ్, బొగ్గు సతీష్ న్యాయవాది గోరంట్ల కోటేశ్వర రావులు పాల్గొన్నారు.

