కూకట్ పల్లి మే 1(జే ఎస్ డి ఎం న్యూస్)
అంతర్జాతీయ కార్మికుల దినోత్సవం, మే డే ,సందర్భంగా మోతీ నగర్ కూడలి ,ఎర్రగడ్డ రోడ్డు, వద్ద జనసేన నాయకుడు దుట్టా రవీంద్రనాథ్ ఠాగూర్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కూకట్ పల్లి నియోజకవర్గం జనసేన పార్టీ ఇంచార్జ్ ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి హెచ్ ఎం సి,టి జి ఆర్ టి సి,వాటర్ వర్క్స్ ,పోస్టల్ డిపార్ట్మెంట్ విద్యుత్ విభాగాల కార్మికులకు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ శాలువాలు వేసి సన్మానించి , రోజు కూలీలకు కు పండ్లు పంపిణీ చేసారు.
ఈ కార్యక్రమంలోనియోజకవర్గ జనసేన పార్టీ నాయకులు, యువత, సామాజిక సేవ చేస్తున్న పెద్దలు , వీర మహిళలు, కాలనీల ప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

