బేగంపేట జనవరి 18 , (జే ఎస్ డి ఎం న్యూస్) :
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, పద్మశ్రీ, స్వర్గీయ డా॥ నందమూరి తారక రామారావు 30వ వర్ధంతి సందర్భంగా, ఎన్టీఆర్ ఘాట్ వద్ద వారి స్మృతికి సికింద్రాబాద్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ వల్లారపు శ్రీనివాస్ కుమార్ నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో తెదేపా సీతాఫలమండీ డివిజన్ అధ్యక్షుడు జి వి కృష్ణ , పరిటాల విజయ్ కుమార్ , శేషిరెఖ , పుప్పాల విజయ్, మురళి, వెంకటస్వామి, చందర్ ముదిరాజ్, నటరాజ్ తదితరులు పాల్గొన్నారు.
