మంత్రి నారా లోకేష్ జన్మ దిన వేడుకలు శుక్రవారం ఎన్ టి ఆర్ విగ్రహం వద్ద రాష్ట్ర
తెలుగు యువత కార్యదర్శి గొల్ల పూడి వేణుబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ సీఎం, టిడిపి పార్టీ వ్యవస్థాపకుడు ఎన్ టిఆర్ విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. భారీ కేక్ను కట్ చేసారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు మేడగం వెంకటేశ్వర రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, వైస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, మన్నేపల్లి, నాగంబొట్ల పాలెం సొసైటీ అధ్యక్షులు గొంది రమణా రెడ్డి (నమర), వల్లభనేని సుబ్బయ్య, డిసిబి ఉపాధ్యక్షుడు తూము శివ నాగి రెడ్డి, తాళ్లూరు గ్రామ పార్టీ అధ్యక్షుడు మారం వెంకా రెడ్డి, ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, క్లస్టర్ ఇన్చార్జి రాచపూడి వెంకట రావు, గొల్లపూడి వేణు బాబు, పిన్నక రమేష్, కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పోలం రెడ్డి రమణా రెడ్డి,సీహెచ్ వీర నాగి రెడ్డి, నవులూరి విద్యా సాగర్ వంగపల్లి నాగేశ్వర రావు, నారిపెద్ది కళ్యాణ్ చక్రవర్తి, చాట్ల డాని, డీఎంసీ డైరెక్టర్లు బొడ్డు నాగేంద్ర హనుమా రెడ్డి, వలి, చిరంజీవి, ఎంఎంఎన్ అధ్యక్షురాలు సుజాత, రామయ్య, లక్ష్మి నారాయణ , సోము శ్రీను, పుట్టా నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

