కంటోన్మెంట్ జనవరి 25
(జే ఎస్ డి ఎం న్యూస్)
సూర్యభగవానుని పూజించి దాన ధర్మాలు చేస్తే స్వామి అనుగ్రహం లభిస్తుందనీ కంటోన్మెంట్ బోర్డ్ మాజీ ఉపాధ్యక్షులు జంపన ప్రతాప్ అన్నారు.ఆదివారం రథ సప్తమి రోజు సూర్య భగవానుణ్ణి పూజించి దాన ధర్మాలు చేస్తే భగవంతుడు భక్తులకు దీర్ఘాయుసు. సిరిసంపదలు ఇస్తాడని జంపన ప్రతాప్ అన్నారు.
రథ సప్తమి పురష్కరించుకొని తిరుమలగిరి సూర్య భగవాన్ ఆలయంలో జంపన ప్రతాప్ ప్రత్యేక పూజలు చేసారు. రథ సప్తమి రోజు ఎవరికైనా ఒక్కరికి గొడుగు. చెప్పులు దానం చేస్తే పుణ్యఫలం దక్కతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ నిర్వాహకులు పాల్గొన్నారు.
