దేశ స్వాతంత్రం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన మహనీయులు త్యాగాలను భారత పౌరులు, ప్రజలు మరువరాదని డిప్యూటీ తహసీల్దార్ ఆర్ శ్రీకాంత్ అన్నారు.77వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం జాతీయ జెండాను ఎగుర వేసి జండా వందనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వ మానవ సౌభాతృత్వం కోసం ప్రతి భారతీయుడు పాటుపడాలన్నారు. జాతి కోసం, దేశం కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి స్వాతంత్రం తెచ్చిన మహనీయుల ఆశయాలను నెరవేర్చే దిశగా యువత ముందడుగు వేయాలని అన్నారు. విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఏ ఈ టి అంకబాబు జండా ఎగుర వేశారు.
