ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి – జిల్లా కలెక్టర్ పి.రాజబాబు

జల జీవన్ మిషన్ పథకంలో భాగంగా ఉమ్మడి జిల్లాలో వెలిగొండ ప్రాజెక్టు ద్వారా నీటి సరఫరా చేసేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని జిల్లా కలెక్టర్ పి.రాజబాబు
చెప్పారు. గురువారం ప్రకాశం భవనంలో ఆయన అధ్యక్షతన జిల్లా వాటర్ – శానిటేషన్ మిషన్ కమిటీ సమావేశం జరిగింది. ఈ పనుల్లో పురోగతిని ఆర్డబ్ల్యూఎస్ ఎస్.ఈ.
నాగేశ్వరరావు ఈ సందర్భంగా వివరించారు. అటవీ, రోడ్లు భవనాలు , రైల్వే, విద్యుత్తు శాఖల నుంచి రావాల్సిన అనుమతుల పెండింగ్, ఉత్తర ప్రత్యుత్తరాలపై కలెక్టర్ ఆరా తీశారు. ఈ అనుమతులు త్వరగా వచ్చేలా చర్యలు తీసుకోవడంతో పాటు సంబంధిత శాఖలు సమన్వయంతో పని చేయాలన్నారు. అవసరమైతే క్షేత్రస్థాయిలో జాయింట్ ఇన్స్పెక్షన్స్ చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ దిశగా కార్యాచరణ ప్రణాళిక రూపొందించి వారం రోజుల్లో పురోగతిని తెలియజేయాలని చెప్పారు.
ఈ సమావేశంలో పంచాయతీరాజ్ ఎస్.ఈ.
అశోక్, ఇరిగేషన్ ఎస్.ఈ. వరలక్ష్మి ,ఏపీ సీపీడీసీఎల్ ఎస్ ఈ వెంకటేశ్వర్లు, రోడ్లు భవనాల శాఖ ఎస్ ఈ రవి నాయక్, జడ్పీ సీఈవో చిరంజీవి, డిపిఓ వెంకటేశ్వరరావు, పబ్లిక్ హెల్త్ ఈఈ శ్రీనివాస సంజయ్, జిల్లా విద్యాధికారి రేణుక, వ్యవసాయ అధికారి శ్రీనివాసరావు, అటవీ, ఐసీడీఎస్ అధికారులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *