శ్రీ పాండు రంగ భజన మందిరం పనులకు భూమి పూజ చేసిన కార్పొరేటర్ ముద్దం..

ఓల్డ్ బోయినపల్లి
ఫిబ్రవరి 5
(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఓల్డ్ బోయిన్పల్లి పరిధిలో శ్రీ పాండురంగ భజన మందిరం పనులకు ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ గురువారం భూమి పూజ చేశారు.1952 సంవత్సరంలో మాల బస్తి లో నిలిచిపోయిన
భవనాన్ని నూతనంగా నిర్మించేందుకు ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సహకారంతో జి హెచ్ ఎం సి నిధులు రూ 25 లక్షలతో చేపట్టనున్న భవనానికి ముద్దం కొబ్బరికాయ కొట్టి పనులను ప్రారంభించారు.
వీలైనంత త్వరగా పనులు పూర్తి చేస్తామని ముద్దం తెలియ జేశారు.ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి వర్క్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్,
బి ఆర్ ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మైపాల్ రెడ్డి, ఎలక్ట్రికల్ సూపర్వైజర్ కృష్ణ, ఎస్సీ సెల్ అధ్యక్షులు బుర్రీ యాదగిరి , శశికళ, కొమరమ్మ, మల్లేశ్వరి, కళావతి, రేణుక పద్మ ,సుమ,శ్రీనివాస్ రెడ్డి,
బస్తీ వాసులు ప్రదీప్ కుమార్, సత్యనారాయణ,టి వి ఎస్ రాజు, రామారావు, నర్సింగరావు, సూరజ్, టీవీ సత్యనారాయణ, జి నర్సింగ్ రావు, ఉమేష్, చంటి, ప్రశాంత్ శీను, శివ, నవీన్, బస్తీ వాసులు మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *