బేగంపేట మార్చి 19 ,(జే ఎస్ డి ఎం న్యూస్) :
ఉగాది పండుగ (తెలుగు నూతన సంవత్సరం శ్రీ పరాభవ నామ సంవత్సరం సందర్భంగా బేగంపేట మోతిలాల్ నెహ్రూ నగర్ లోని సనత్ నగర్ నియోజకవర్గము బిజెపి కార్యలయములో బిజెపి రాష్ట్ర యువ నాయకులు మర్రి పురురవ రెడ్డి నియోజకవర్గము ముఖ్య నాయకులతో కలిసి ప్రత్యేక పూజ కార్యక్రమమును నిర్వహించారు. మర్రి పురురవ రెడ్డి అందరికి ఉగాది పచ్చడిని మరియు స్వీట్ లను పంచి పెట్టారు. పూజ కార్యక్రమములో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు. దయానంద్ , నక్క శ్రీనివాస్ గౌడ్ , యం. మహేష్ కుమార్ ముదిరాజ్ , సంధ్య లక్ష్మీ , వంశీ కృష్ణ, రాజీవ్ దేశ్ పాండే , గుంటి సత్యనారాయణ, , యం. విజయ్ కుమార్ , కె. నరేష్ , కె. శ్రవణ్ , పిట్ల శ్రీనివాస్ , లోహిత్ తదితరులు పాల్గొన్నారు.

