సోమాజిగూడ, ఆగస్ట్ 6(జే ఎస్ డి ఎం న్యూస్)
సోమాజీగూడ లోని సెంటర్ ఫర్ ఎకనామిక్స్ అండ్ సోషల్ స్టడీస్ (సెస్) లో ఆచార్య కొత్తపల్లి జయశంకర్ 92వ జయంతివేడుకలు గురువారం ఘనంగా జరిగాయి.ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ డాక్టర్ జి. చిన్నారెడ్డి, ఆర్థిక నిపుణులు జి ఆర్ రెడ్డి, సెస్ డైరెక్టర్ ప్రొఫెసర్ రేవతి ప్రొఫెసర్
ముత్యంరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జయశంకర్ చేసిన కృషినికొనియాడారుసమైక్య రాష్ట్రంలో తెలంగాణప్రాంతానికి జరిగినఅన్యాయం పై మూడుతరాలుగా కొనసాగించిన ఘనత జయశంకర్ కు దక్కుతుందని అన్నారు.జయశంకర్ తెలంగాణ
ఉద్యమ వ్యాప్తికి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం వరకు చేసిన పోరాటం గురించి చిన్నారెడ్డి వివరించారు.
