నాగులుప్పలపాడు, ఆగస్టు 10 :
ఉప్పుగుండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కనగాల శ్రీనివాస రావు ప్రభుత్వ వైద్యశాల గ్రామంలో నిర్మించాలని అహర్నిశలు కృషి చేస్తూ మానసిక ఒత్తిడికి లోనై అస్వస్థకు గురయ్యారు. ఆయన కోలుకోవాలని సోమవారం ఉప్పుగుండూరులో శివాలయం మరియు శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో తెలుగుదేశం, జనసేన ,బిజెపి కూటమి నాయకులు ఆలయ అర్చకులు శిష్లా రంగయ్య, దీవి శ్రీధర్ బాబులు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరిపించారు.అందరివాడు,నిస్వార్థ రాజకీయనాయకుడు, గత 30 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలో నిబద్ధత కలిగిన నాయకుడుగా , మూడుసార్లు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్ గా, రెండు సార్లు తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గా ఉంటూ గ్రామాభివృద్ధి ధ్యేయంగా పరితపించే ఉప్పుగుండూరు గ్రామ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మన కనగాల శ్రీనివాసరావు గ్రామంలో సర్వే నెంబర్ 78 లోనిఎకరా 1.50 సెంట్లు ప్రభుత్వ భూమిలో తెలుగుదేశం ,జనసేన ,బిజెపి,కూటమి ప్రభుత్వ హయాంలోనే 30పడకల ప్రభుత్వ వైద్యశాల నిర్మించాలని పట్టుదలతో పాటుగా పేద ప్రజలకు ఉచిత ప్రభుత్వ వైద్యం అందించాలని ఆ పనిపై అహర్నిశలు అలుపెరగకుండా పాటు పడుతూ మానసిక ఒత్తిడికి లోనై తీవ్ర అస్వస్థకు గురయ్యాడు. విజయవాడ లోని ఆయుష్ వైద్యశాల లో చికిత్స పొందుతున్నారు.కనగాల. శ్రీనివాసరావు సంపూర్ణ ఆరోగ్యంగా కోలుకొని తిరిగి ప్రజాసేవలో నిమగ్నం అవ్వాలని కోరుతూకూటమి నేతలు అందరూకలసి మన గ్రామంలో వేంచేసియున్న శ్రీ గౌరీశ్వర స్వామిఆలయం (శివాలయం), మరియు శ్రీ రుక్మిణి సత్యభామ సమేత ఆళ్వార్ రాజుల శ్రీ వేణుగోపాల స్వామి స్వామి వార్ల ఆలయాలలో ప్రత్యేక పూజలునిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిడిపి పార్టీ నాయకులు కూతంబాకం సెల్వం, కుంచాల నాగరాజు, మసిముక్కు భాస్కరరావు, నల్లూరు భాస్కరరావు,కొప్పర్తి నాగయ్య పిన్నక.శ్రీకాంత్ బెల్లం శ్రీనివాసులు, బెల్లం.హరిబాబు, గద్దె త్యాగరాజు, కొండ్రు దాస్, కొంజేటి జలంధర్,ఉప్పుగుండూరులక్ష్మీనారాయణ, బిజెపి నాయకులు రంగయ్య పంతులు,జనసేన వెంకట్, యలమంచి శ్రీను, మాగులూరు రాఘవయ్య, నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

