తాళ్లూరు మండలంలోని 7460 మంది రైతులకు 2023 2024 సంవత్స రానికి గాను రెండోవిడత రైతుభరోసా నిధులు మంజూరైనట్లు వ్యవసాయాధికారి ప్రసాద రావు తెలిపారు. తాళ్లూరు రైతుభరోసా కేంద్రం లో రైతులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా రెండో విడత నిధులు నేరుగా జమ చేయడం జరిగిందన్నారు. నగదును రబీలో సాగు ఖర్చులకు ఉపయోగించుకో వాలని ఎంపీడీఓ కె. యుగకీర్తి రైతులకు సూచించారు. నాగరాజునాయక్, వెంకటరావు, నాగరాజు, రైతులు పాల్గొన్నారు.
