సుపరిపాలన జగనన్నకే సాధ్యమని తాళ్లూరు మండల జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి అన్నారు. తాళ్లూరు మండల కేంద్రంలో సచివాలయం-1లో గురువారం వై నీడ్స్ ఎపీ జగన్ ను నిర్వహించారు. జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి మాట్లాడుతూ కోవిడ్లో రెండేళ్ల పాటు ఆర్ధిక ఇబ్బందులు ఉన్నా సరే సీఎం వైఎస్ జగనన్న నవరత్నాలు నిర్వరామముగా అందిరికి అందించారని అన్నారు. అనేక పథకాలు అమలు చేసిన ముఖ్యమంత్రి ఎపీకి అవసరమని అనేక సంక్షేమ పథకాలలో లబ్ది పొందిన ప్రతి ఒక్కరూ సీఎం వైఎస్. జగనన్నకు సమర్ధించి మరలా సీఎంను చెయ్యాల్సిన బాధ్యత ఉందని అన్నారు. ప్రభుత్వ పథకాల లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో తాళ్లూరు సర్పంచి మేకల చార్లెస్ సర్జన్, వైఎస్ ఎంపీపీ ఇడమకంటి వెంకటేశ్వర రెడ్డి, పార్టీ అధ్యక్షుడు టీవీ సుబ్బా రెడ్డి, సొసైటీ అధ్యక్షులు యాడిక యలమందా రెడ్డి, కుమ్మిత జయరామి రెడ్డి, మాజీ సొసైటీ అధ్యక్షుడు, ఉప సర్పంచి పులి ప్రసాద్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, మల్కాపురం, మన్నేపల్లి, రామభద్రాపురం సర్పంచిలు షేక్ వలి, మంచాల వెంకటేశ్వర రెడ్డి, బీవీ నాగి రెడ్డి, కెవీపాలెం సచివాలయ కన్వినర్ కొర్రపాటి విష్ణు, ఎంపీడీఓ కెవై కీర్తి, ఎంఈఓ జి సుబ్బయ్య, వ్యవసాయాధికారి ప్రసాద్ రావు, ఈఓఆర్డీ కెజీఎన్ రాజు, ఎపీఎం దేవరాజ్, గ్రామకార్యదర్శి అల్లం వెంకటేశ్వర్లు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.
దివంగత సీఎంకు నివాళి, పార్టీ జెండా ఆవిష్కరణ….
స్థానిక వెల్లంపల్లి రోడ్లో ఉన్న దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఆవిష్కరించారు.





