ఫైరింగ్ సాధన ప్రక్రియలో భాగంగా చీమకుర్తి నందు గల జిల్లా ఫైరింగ్ రేంజ్ లో పోలీసు అధికారులకు నిర్వహించిన వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ సెషన్ ను గురువారం జిల్లా ఎస్పీ ఏ. ఆర్ దామోదర్ సందర్శించి అక్కడ చేస్తున్న ఫైరింగ్ ప్రక్రియ గూర్చి అధికారులకు పలు సూచనలు తెలియచేసినారు.
ఫైరింగ్ సాధన ప్రక్రియలో జిల్లా ఎస్పీ పాల్గొని ఫైరింగ్ ప్రాక్టీస్ చేసే అధికారులలో ఉత్సాహాన్ని, మనోధైర్యాన్ని నింపారు. ఈ ఫైరింగ్ లో ప్రతి అధికారి పాల్గొని మంచి మెళకువలు నేర్చుకొని, ఫైరింగ్ నందు ఉన్న సందేహాలను నివృత్తి చేసుకోవాలని సూచించారు. ఫైరింగ్ రేంజ్ నందు క్రమశిక్షణ అత్యంత ప్రాముఖ్యం వహిస్తుందని, కావున ఫైరింగ్ రేంజ్ అధికారుల సూచనల మేరకు ఫైరింగ్ జాగ్రత్తగా, ఏకాగ్రతతో చెయ్యాలని, ప్రతి ఒక్క బుల్లెట్ టార్గెట్ వైపే బుల్స్ ఐ పడే విధంగా తర్పీదు పొందాలన్నారు. కొత్తగా వచ్చిన ఆయుధాల గురించి పూర్తి స్ధాయిలో తర్ఫీదు పొంది అత్యవసర సమయాలలో ప్రజల, ప్రభుత్వ, ధన, ప్రాణ రక్షణకై ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలని సూచించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని, అదేవిధంగా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకొని జిల్లా పోలీసు శాఖ యొక్క ఉన్నతి కోసం ముందడుగు వేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.నాగేశ్వరరావు, ఎఆర్ అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డీఎస్పీలు లక్ష్మి నారాయణ, నాగరాజు, సాయి ఈశ్వర్ యశ్వంత్, కె.శ్రీనివాసరావు,సీఐలు,ఆర్ఐలు,ఎస్సైలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.











