వైసీపీ రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ని ఆపార్టీ జిల్లా రైతు సంఘ కార్యదర్శి సంగు కొండా రెడ్డి తాడేపల్లిలో బుధవారం కలిసారు. జిల్లాలో ఎల్ నిలో తో రైతులు ఎదుర్కోంటున్న సమస్యలు, గతంలో పంటల భీమాకు రైతులు కేవలం రూపాయి మాత్రమే కట్టి సేవలు పొందే వారని నేడు రైతులు సాగు చేసిన పంటలకు వేలకు వేలు భీమా సగదు చెల్లించాల్సి వస్తుందని చెప్పారు. కనీసం ఎల్ నిలో ప్రభావంతో అయినా సరే భీమా నగదు ప్రభుత్వం చెల్లించక పోవటం రైతులకు ఆపార్టీకి ఉన్న ప్రేమకు నిదర్శమని అన్నారు. రాబోవు స్థానిక ఎన్నికలలో పార్టీ పరిస్థితిని, వైసీపి జిల్లా అధ్యక్షుడు డాక్టర్ బూచేపల్లి శివ ప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ అభ్యున్నతికి చేస్తున్న కృషి ని వివరించారు. రైతుల సమస్యలపై డాక్టర్ బూచేపల్లి శివన్న ఆధ్వర్యంలో చేస్తున్న పోరాటాల గురించి వివరించారు .
