చిరుధాన్యాలతో రోగాలు దూరం అవుతాయని ఎమ్మెల్యే డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ అన్నారు. అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరం సందర్భంగా చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ వ్యవసాయాధికారి ప్రసాదరావు ఆధ్వర్యంలో చేపట్టిన ప్రదర్శనను ప్రారంభించి మిల్లెట్స్ను పంపిణీ చేసారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించినందుకు ప్రతి రైతు తాను పండించి , తాను నివాసంలో ఉపయోగించి చిరు వ్యాధులను దూరంగా ఉండాలని కోరారు. అనంతరం మినికిట్స్ను పంపిణీ చేసారు. ఆయా కార్యక్రమాలలో వైఎస్సార్సీపీ తాళ్లూరు మండల ఇన్చార్జి మద్దిశెట్టి రవీంద్ర, ఎంపీపీ తాటికొండ శ్రీనివాసరావు, జెడ్పీటీసీ మారం వెంకట రెడ్డి, వైస్ ఎంపీపీలు ఐ. వెంకటేశ్వర రెడ్డి, ఎం ఎస్పీ నాగార్జున రెడ్డి, మాజీ ఎఎంసీ చైర్మన్లు మారం వెంకారెడ్డి, ఐ. వేణుగోపాల్ రెడ్డి, జెసీఎస్ కన్వినర్ యాడిక శ్రీనివాస రెడ్డి, పార్టీ కార్యదర్శి యాడిక యలమందా రెడ్డి, సొసైటీ చైర్మన్లు మంచాల వలసా రెడ్డి, శనివారపు శ్రీనివాస రెడ్డి, -మాజీ సొసైటీ అధ్యకుడు పలి ప్రసాద్ రెడ్డి, కోఆప్షన్ మెంబర్ కరిముల్లా, సర్పంచిలు సుబ్బారావు , వలి పిఎస్ శ్రీకాంత్ రెడ్డి , మందా శాంసన్ , ఎంపీటీసీ బాలకోటయ్య , దేవస్థాన కమిటీ మాజీ చైర్మన్ పులి బ్రహ్మారెడ్డి, ముచ్చుమారి బ్రహ్మారెడ్డి ,మాజీ సర్పంచి టీవీ సుబ్బా రెడ్డి, నిశంకం హనుమంతరావు, వికాస్ , ఎస్సీ సెల్ మాజీ అధ్యక్షుడు పూనూరి దేవదానం, ఉప సర్పంచ్ కాశిరెడ్డి, విజిలెన్స్ కమిటీ మెంబర్ సోము అనిల్ కుమార్ రెడ్డి , కుమ్మిత జయరామి రెడ్డి స్థానిక ప్రజా ప్రతినిధులు, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు.
