చిరుధాన్యాల సాగు, వినియోగంతోనే సిరులు ఉంటాయని సీడీపీఓ సీహెచ్
భారతి అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో శనివారం పోషణ్ పక్వాడ్ కార్యక్రమాన్ని నిర్వహించారు. వ్యవసాయాధికారి ప్రసాదరావు పాల్గొని చిరుధాన్యాల సాగు చాలా లాభదాయకమని, ప్రతి అంగన్వాడీ టీచర్ చిరు ధాన్యాలను సాగు చేసి
వినియోగిస్తూ ఇతరులకు ఆదర్శంగా నిలవాలని కోరారు. అనంతరం చిరుధాన్యాల ప్రాముఖ్యతను వివరిస్తూ ర్యాలీ నిర్వహించారు. చిరుధాన్యాలు, కూరగాయలతో ఏర్పాటు చేసిన పోషణ్ పక్వాడ్ లోగో ఆకర్ణనీయంగా నిలచింది. ఎసిడిపిఓ అంజమ్మ, సూపర్వైజర్లు జ్యోతి, సునీత, హేమలత, అనురాధ, నాగమణి, అంగన్వాడీ టీచర్లు
పాల్గొన్నారు.
