గ్రామాలలోని రైతులు ప్రజలు తమ భూ సమస్యల కు సంబంధించి ఏవైనా సమస్యలు ఉంటే మీ గ్రామాల్లో జరిగే రీ సర్వే గ్రామ సభలో తెలియజేయాలని తహసిల్దార్ మహమ్మద్ నయీమ్ అహ్మద్ అన్నారు. మండలంలోని చిన్న ఉల్లగల్లు గ్రామంలో సోమవారం భూమి రి సర్వే గ్రామసభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మహమ్మద్ నయీమ్ అహ్మద్ మాట్లాడుతూ గ్రామంలో భూమి2519.73 ఎకరాల భూమి ఉందని,266 సర్వే నెంబర్లు ఉన్నాయని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచి జనమల నాగేంద్రం పిచ్చయ్య, ఈ సర్వే డిప్యూటీ తహసిల్దార్ టి రవికాంత్, వీఆర్వో బి రమణ, గ్రామస్తులు జిల్లెల మూడి శివయ్య తదితరులు పాల్గొన్నారు.
