బిజేపి ఆధ్వర్యంలో పండిత్ దీనదయాల్ ఉపాధ్యాయ జయంతిని సోమవారం
బిజేపి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. దర్శి బిజేపి పార్టీ కార్యాలయంలో పండిత్ దీనదయాల్ చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. దీనదయాల్ జన సంఘ వ్యవస్థాపకుడు అని ఎకాతాత్మత మానవత వాదమని ఎకకాల సమగ్ర కార్యక్రమాన్ని సూచించే మానవతా వాదమనే రాజకీయ తత్వాన్ని రూపొందించారు అని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో బిజేపి దర్శి అసెంబ్లీ కన్వినర్ మాడపాకుల శ్రీనివాసులు, జిల్లా ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఉన్నం శ్రీనివాసులు, కనితి నాగభూషణాచారి, సుబ్బారెడ్డి, అనిల్, వంకదారి కుమార్, పట్టణ అధ్యక్షుడు గురువర్ధన రావు తదితరులు పాల్గొన్నారు.
