దొనకొండ మండలం పెద్దన్న పాలెం సర్పంచ్ భర్త నాగయ్య మృతదేహాన్ని వైసిపి తాళ్లూరు మండల ఇన్చార్జి ఎమ్మెల్యే సోదరుడు మద్దిశెట్టి రవీంద్ర సందర్శించి పూలమాలవేసి, నివాళులర్పించారు. పార్టీ మంచి నాయకున్ని కోల్పోయినదని , ఆయన లేని లోటు తీర్చలేనిదని , ఆయన సేవలు మరువలేనివని అన్నారు. ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇచ్చారు. స్థానిక నాయకులు నియోజకవర్గ నాయకులు ఆయన వెంట ఉన్నారు.


