పేస్ కళాశాలలో వ్యవస్థాపకత (ఎంట్రప్రెన్యూర్ షిప్) యాక్టలైజేషన్పై ఇంజనీరింగ్,
ఎంబీఏ విద్యార్థులకు గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. శ్రీ క్రిష్ణ దేవరాయ యూనివర్సీటీ అటల్ ఇంక్యుబేషన్ సిఈఓ డాక్టర్ శివ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అవగాహన కల్పించారు. ఒక వ్యాపారాన్ని ఏలా ప్రారంభించాలి. అభివృద్ధి చెయ్యాలి. భారత దేశంలో అమలు పరస్తున్న వివిధ రకాల బిజినేస్ స్కీమ్లను ఎలా సద్వినియోగం చేసుకోవాలి అనే విషయాలను వివరించారు.
కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెట్ డాక్టర్ మద్దిశెట్టి శ్రీధర్, ప్రిన్సిపాల్ డాక్టర్ జీవికే మూర్తి, డీన్ ఆఫ్ స్టూడెంట్స్ ఎఫైర్స్ డాక్టర్ ఆర్ వీరాంజనేయులు, ఇంక్యుమేషన్ ఇన్చార్జి డాక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈడీసీ కోఆర్డినేటర్ డాక్టర్ ఎలియా ఆధ్వర్యంలో సదస్సు నిర్వహించారు.
