తూర్పు గంగవరం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఇటీవల నిర్వహించిన ఆరోగ్య సురక్ష కార్యక్రమంలో కంటి శుక్లాలు ఉన్న 48 మందిని కంటి ఆపరేషన్ కోసం శంకర నేత్రాలయానికి గురువారం తరలించారు. తూర్పుగంగవరం పీహెచ్ సీ పరిధిలోని గ్రామాల్లో నిర్వహించిన వైద్య శిబిల్లో గుర్తించిన 48 మందికి ఆపరేషన్లను ప్రభుత్వం ఉచితం గా చేయిస్తుందని వైద్యులు బంకా రత్నం తెలిపారు. కార్యక్రమంలో వైద్యులు మౌనిక, సిబ్బంది పాల్గొన్నారు.
