ఉన్నత పాఠశాలల్లో ట్యాబ్ లు, ఇంటరాక్టిక్ ప్లాట్ ప్యానల్స్ వినియోగంపై..ఉపాధ్యాయులు, విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ఈ విద్యా సంవత్సరం నుండే *ఇంజనీరింగ్ నాలుగో ఏడాది చదివే విద్యార్థులను నియమిస్తున్నట్లు పాఠశాల విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ తెలిపారు.
_*వీరికి ఉపకార వేతనంగా రూ.12వేలు చెల్లిస్తారు. రవాణా కింద కళాశాల నుండి బడి వరకు ఉండే దూరానికి కి.మీ.కు రూ.2 చొప్పున ఇస్తారు.*_
_*రాష్ట్ర వ్యాప్తంగా 7,094 ఉన్నత పాఠశాలలకు కలిపి 2,379 మంది ఇంటర్న్ షిప్ చేయనున్నారు. ఒక్కొక్క విద్యార్థికి మూడు పాఠశాలలు అప్పగిస్తారు.*_
_*జూన్ 12 నుండి వీరు పాఠశాలల్లో పని చేసేలా ఇంజనీరింగ్ విద్యార్థులను వివిధ స్థాయిల్లో ఎంపిక చేస్తారు.*_