జిల్లాలో అల్పపీడనం ప్రభావంతో కురిసిన వర్షాలకు 17986. 175 ఎకరాలలో సజ్జ, మినుము , అలచంద, జొన్న, ప్రత్తి , వరి , కొర్ర పొగాకు పంటలు దెబ్బతిన్నట్లు ప్రాధమిక అంచనాలు అందినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో 26 మండలాల్లో 119 గ్రామాల్లో 7241 మంది రైతులకు చెందిన ఆయా పంటలు 17986. 175 ఎకరాలు ఉన్నట్లు ప్రాధమిక అంచనాకు అందినట్లు వివరించారు.
