జిల్లాలో ఫెయింజల్ తుఫాన్ వలన పలు పంటలు 2198 హెక్టార్లలో నష్టం వాటిల్లి నట్లు ప్రాధమిక అంచనా వేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి ఎస్ శ్రీనివాస రావు తెలిపారు. జిల్లాలో 64 గ్రామాలలో 2115 మంది రైతులకు చెందిన 2198 హెక్టార్లు పలు పంటలు దెబ్బతిన్నట్లు తెలిపారు. అందులో వరి 54 హెక్టార్లు, మినుము 512 హెక్టార్లు, శనగ 1547 హెక్టార్లు, కంది 85 హెక్టార్లు ఉన్నట్లు చెప్పారు.
