బూత్ లెవల్ అధికారులు అప్రమత్తంగా ఉండి నూతన ఓటర్ల నమోదు, లేని వారిని తొలగింపు చేస్తూ ఓటర్ల జాబితాను ఎప్పటికప్పుడు నూతనంగా ఉండేలా చూడాలని దర్శి నియోజక వర్గ ఓటర్ల నమోదు అధికారి (ఈఓఆర్) కోరారు. స్థానిక మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో గురువారం బిఎల్దలకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఈఓఆర్ ఓ మాట్లాడుతూ బిఎల్షను ఎన్నికల కమీషన్ ఇచ్చిన నూచనలు తూచ తప్పకుండా పాటించాలని చెప్పారు. యాప్ల గురించి, ఆర్పి యాక్ట్ 1950 సెక్షన్ల గురించి శిక్షణ ఇచ్చారు. ఆన్లైన్ ద్వారా పరీక్షను నిర్వహించి సర్టిఫికేట్స్ అందజేసారు. కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మి నారాయణ ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్ టి దేవ ప్రసాద్, మాస్టర్ ట్రైనర్ టి రవిచంద్ర, సిబ్బంది పాల్గొన్నారు.

