కనిగిరి నియోజకవర్గంలో మహిళా సాధికారతకు ప్రాధాన్యతనిస్తూ, జనని చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఆధ్వర్యంలో గత ఒక సంవత్సరంగా ఉచిత కుట్టు శిక్షణ కార్యక్రమాలు నిరంతరంగా కొనసాగుతున్నాయి.
ఈ క్రమంలో, దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకొని, మూడు నెలల శిక్షణ పూర్తి చేసుకున్న 140 మంది మహిళలకు ఉచిత కుట్టు మిషన్ల పంపిణీ కార్యక్రమం సోమవారం అమరావతి గ్రౌండ్స్లో ఘనంగా నిర్వహించారు.
పండుగ వాతావరణంలో జరిగిన ఈ కార్యక్రమంలో, రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా బాల వీరాంజనేయస్వామి ముఖ్య అతిథిగా పాల్గొని మహిళలకు కుట్టు మిషన్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ …
దీపావళి వెలుగులు ప్రతి ఇంటిలో వెలగాలని, మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలని ఆకాంక్షిస్తూ, ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మహిళలకు దీపావళి కానుకగా ఈ కుట్టు మిషన్లు అందజేయడం అభినందనీయం. జిల్లాలో ఎవరూ చేయని అభివృద్ధి కనిగిరిలో జరుగుతోంది. ఇది ఉగ్ర నరసింహారెడ్డి కృషికి నిదర్శనం అని అన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి మాట్లాడుతూ…
మహిళలు ఆర్థికంగా ఎదిగి అభివృద్ధి చెందాలని లక్ష్యంగా పెట్టుకొని గత ఏడాది నుండి ఉచిత కుట్టు మిషన్ శిక్షణా కేంద్రం నిర్వహిస్తున్నామని, ఈ మిషన్లు స్వయంశక్తితో జీవనోపాధి పొందేందుకు దోహదపడతాయి. ప్రతి మహిళ తన ప్రతిభను వినియోగించి స్వయం ఆధారంగా ఎదగాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ బొగ్గరపు శ్రీలత సద్గురు, ఆర్డీవో కేశవర్ధన్ రెడ్డి, డి.ఎస్.పి సాయి ఈశ్వర్ యశ్వంత్, మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, అధికారులు, మహిళలు పాల్గొన్నారు.
