తమ హక్కులు తెలుసుకుని ఉపయోగించుకోవాలి – రజానగరంలో పౌర హక్కుల దినోత్సవం నిర్వహణ

కాలనీ వాసులు తమ హక్కులను తెలుసుకుని ఉపయోగించుకోవాలని డిప్యూటీ
తహసీల్దార్ గోపాలుని ఫణీంధ్ర అన్నారు. రజానగరం ఎస్సీ కాలనీలో మంగళవారం పౌర హక్కుల దినోత్సవం సర్పంచి వలి అధ్యక్షతన నిర్వహించారు. రజానగరం ఎస్సీ కాలనీలో 2014-19 మధ్య కాలంలో నిర్మించుకున్న కాలనీలకు బిల్లులు రాలేదని, స్పందించి ఇప్పించాలని కోరారు. కాలనీలో సైడు కాలువలు లేవని, వీధిలైట్లు వెలగటం లేదని చెప్పారు. కుక్కల బెడద ఎక్కువగా ఉందని తగిన విధంగా పరిష్కరించాలని కోరారు. కార్యాలయ ఎన్ ఏ శ్రీనివాస రావు, విఆర్ నాగూర్ బీ, సెక్రటరీ శేషమ్మ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *