బేగంపేట ఫిబ్రవరి 3
(జే ఎస్ డి ఎం న్యూస్) :
వంశీ నిస్వార్థ సేవా ఆధ్వర్యంలో పేదలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమం బేగంపేట పరిధిలోని అల్లంతోట భావి గీతాంజలి పాఠశాల ఆట స్థలంలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్,బేగంపేట డివిజన్ కాగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గౌరపల్లి రమేష్ లు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ వంశీ నిస్వార్ట్ సేవ గ్రూప్ ఆధ్వర్యంలో పేద ప్రజలకు అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయం అన్నారు.
ఈ కార్యక్రమంలో నిర్వాహకులు హరీష్ జైన్,దిలీప్, వినోద్ జైన్,రాజేష్,తులసి జైన్,దినేష్,అమిత్,సంజయ్, కేసన్,సూరజ్ తదితరులు పాల్గొన్నారు.
