హైదరాబాద్ మార్చి 11
(జే ఎస్ డి ఎం న్యూస్) :
సికింద్రాబాద్ యశోద ఆసుపత్రిలో నకిలీ వైద్యుల చేతివాటంబయటపడింది.పేషెంట్ కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ యాప్రాన్ వెసుకున్న ఓ మహిళ రూమ్ లోకి వచ్చింది.వారి కుటుంబీకులందరిని బయటకు పంపి,పేషేంట్ కు స్పృహ లేకుండా చెసి
పది తులాల బంగారం తో ఉడాయించింది.కొద్ది సేపటి తర్వాత విషయం గమనించిన పేషేంట్ బంధువులు ఆసుపత్రి యజమన్యనికి ఫిర్యాదు చేశారు.వచ్చిందేవరో
తమకు తెలియదంటూ స్పష్టం చెయడంతో మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు.ఓల్డ్ బోయిన్ పల్లి
కి చెందిన సుధరాణి అనే మహిళ అనార్యోగంతొ ఆసుపత్రి లో చెరింది.డిశ్చార్జ్ చేసే సమయంలో సుధరాణి ఉన్న గదిలోకి ఓ మహిళ యాప్రాన్ వెసుకోని వచ్చింది.పేషేంట్ బంధువులను బయటకు వెళ్ళమంటూ సూచించడంతో వారంత బయటకు వెళ్లారు.యాప్రాన్ వెసుకోని వచ్చిన మహిళ బయటకు వెళ్ళిన కోద్ది సమయనికి లోపలికి వెళ్ళి చూడగా సుధరాణి స్పృహ కోల్పోయి ఉంది.వెంటనే యశోద ఆసుపత్రి యజమాన్యం కు ఈ విషయం తెలియజేసారు.ఎవరు వచ్చారో తమకు తెలియదంటూ యాజమాన్యం స్పష్టం చెయడంతో వెంటనే మార్కెట్ పోలీసులకు ఫిర్యాదు చెశారు.అయితే యాప్రాన్ లో వచ్చిన మహిళ,నర్సింగ్ స్టాఫ్ రూం లో వెళ్ళి రావడం,అక్కడ సీసీ ఫుటేజ్ లో ఉండడం తో తెలిసిన వారి పనా,లేక మరేవరైన వచ్చారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చెస్తున్నారు.పది తులాల బంగారం పోయిందంటూ మహిళ కుమారుడు ఫిర్యాదులో పెర్కోన్నారు.
