
టిడిపి కార్యకర్తల సంక్షేమమే పార్టీ లక్ష్యమని టిడిపి దర్శి నియోజక వర్గ ఇన్చార్జి
డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి అన్నారు. తాళ్లూరు మండలంలో కొర్రపాటి వారి పాలెం లో ఆంజనేయులు ప్రమాదంలో మృతి చెందటంతో ఆయనకు పార్టీ సభ్యతం ద్వారా మంజూరు అయిన రూ. 5 లక్షల చెక్కును అందించారు. ముందుగా ఆంజనేయులు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. టిడిపి నాయకులు డాక్టర్ కడియాల లలిత్ సాగర్, నియోజక వర్గ పరిశీలకులు గంజాం రాఘ వేంధ్ర, గ్రామ నాయకులు గొల్ల పూడి వేణుబాబు, కొట చిరంజీవి, యలమంద రావు, కొర్రపాటి రామయ్య తదితరులు ఉన్నారు.

తాళ్లూరులో ఇటీవల మృతి చెందిన మాగంటి వెంకట రావు చిత్ర పటానికి పూల మాలలు వేసి నివాళులు అర్పించారు. వారి కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. టిడిపి నాయకుల ఇడమకంటి రమణా రెడ్డి, గొల్ల పూడి వేణు బాబు తదితరులు పాల్గొన్నారు.