ఖరీప్లో సాగు చేసిన పంటలకు తక్షణమే ఈ – పంట నమోదు చేయించాలని వ్యవసాయాధికారి ప్రసాద రావు కోరారు. తూర్పుగంగవరంలో సోమవారం ఈ- పంట నమోదును ఆయన పరిశీలించారు. ఖరీఫ్లో 36,704 ల్యాండ్ పార్శిల్స్ నమోదు చేయవలసిన ఉన్నదని చెప్పారు. ఈ – పంట నమోదు అయితేనే ఎరువులు కేటాయిస్తారని తెలిపారు. కార్యక్రమంలో ఎఈఓ కెవీ సుబ్బా రెడ్డి, విఏఏ సుప్రజ రైతులు పాల్గొన్నారు.
