హైదరాబాద్, జూలై 26, (జే ఎస్ డి ఎం న్యూస్)
బంజారాహిల్స్ కిమ్స్ ఫెర్టిలిటీ & ఐవీఎఫ్ సెంటర్ లో ప్రపంచ ఐవీఎఫ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రత్యేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ సందర్భంగా సంతానలేమి చికిత్సలో జరుగుతున్న ఆధునిక అభివృద్ధులు, సమయానికి చికిత్స తీసుకోవడం యొక్క ప్రాముఖ్యతపై వైద్య నిపుణులు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా డా. నిమ్మ పూజా రెడ్డి, కన్సల్టెంట్ ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ & లాపరోస్కోపిక్ సర్జన్, మాట్లాడుతూ ఆధునిక ఐవీఎఫ్ సాంకేతికతలతో విజయవంతమైన గర్భధారణఅవకాశాలు గణనీయంగా పెరిగాయనితెలిపారు. సంతానలేమి సమస్యలను ఎదుర్కొంటున్న దంపతులు ఆలస్యం చేయకుండానిపుణులను సంప్రదిస్తే మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సూచించారు.డా. బి. సింధూర, ఫెర్టిలిటీ కన్సల్టెంట్ & రీప్రొడక్టివ్ రీజెనరేటివ్ మెడిసిన్ స్పెషలిస్ట్, మాట్లాడుతూ పునరుత్పత్తి వైద్యం మరియు రీజెనరేటివ్ థెరపీలలోజరుగుతున్న తాజా
అభివృద్ధుల గురించి వివరించారు. ఈ ఆధునిక చికిత్సా విధానాలు సంతానోత్పత్తి సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు.ఈ సందర్భంగా వైద్యులు మాట్లాడుతూ, తెలుగు రాష్ట్రాల్లో పూర్తిగా నొప్పిలేని (పెయిన్లెస్), సూదులు అవసరం లేని (నీడిల్-ఫ్రీ) ఫెర్టిలిటీ చికిత్సలను ప్రవేశపెట్టిన తొలి ఫెర్టిలిటీ కేంద్రం కిమ్స్ ఫెర్టిలిటీ & ఐవీఎఫ్ సెంటర్ అని పేర్కొన్నారు.
ఈ వినూత్న చికిత్సా విధానం ద్వారా రోగుల్లో చికిత్సపై ఉండే భయం, ఆందోళన తగ్గి మరింత సౌకర్యవంతమైన అనుభవం కలుగుతోందని వివరించారు.
కార్యక్రమంలో పాల్గొన్న దంపతులు, రోగులతో వైద్య నిపుణులు ప్రత్యక్షంగా మమేకమై, సంతానలేమి మరియు ఐవీఎఫ్ చికిత్సలపై ఉన్న అపోహలను నివృత్తి చేశారు. సరైన సమయంలో పరీక్షలుచేయించుకోవడం, నిపుణుల సలహా తీసుకోవడం ద్వారా సంతానలేమి సమస్యలను సమర్థవంతంగా అధిగమించవచ్చని తెలిపారు.సంతానాన్ని ఆశించే
దంపతులకు ఫెర్టిలిటీ ఆరోగ్యం, ముందస్తు నిర్ధారణ, అందుబాటులో ఉన్న అత్యాధునిక చికిత్సా విధానాలపై అవగాహన కల్పించడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు.అత్యాధునిక సాంకేతికత, అనుభవజ్ఞులైన వైద్య నిపుణులు, వ్యక్తిగతఅవసరాలకు అనుగుణమైన చికిత్సా ప్రణాళికలు మరియు వినూత్న వైద్య సేవలతో కిమ్స్ ఫెర్టిలిటీ & ఐవీఎఫ్ సెంటర్ ప్రపంచ స్థాయి ఫెర్టిలిటీ సేవలను అందిస్తూ ముందంజలో కొనసాగుతోంది.

