హైదరాబాద్ ఆగస్టు 31,(జే ఎస్ డి ఎం న్యూస్) : సికింద్రాబాద్లోని రైల్ నిలయంలో జరిగిన భద్రతా సమీక్షాసమావేశం సోమవారం పది మంది ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” భద్రతా పురస్కారాలను ప్రదానం చేశారు.
ఈ సమావేశంలో దక్షిణ మధ్య రైల్వే అదనపు జనరల్ మేనేజర్ సత్య ప్రకాష్, వివిధ శాఖల ప్రధాన అధిపతులతో
కలిసి పాల్గొన్నారు. హైదరాబాద్ మరియు నాందేడ్ మూడు డివిజన్ల డివిజనల్ రైల్వే మేనేజర్లు (డి.ఆర్.ఎం.లు) వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు.
సికింద్రాబాద్, హైదరాబాద్ మరియు నాందేడ్ డివిజన్లకు చెందిన వివిధ భద్రతా విభాగాలకు చెందిన పది (10) మంది ఉద్యోగులకు “ఎంప్లాయీ ఆఫ్ ది మంత్” అవార్డులను ప్రదానం చేశారు. వీరు తమ విధుల పట్లఆదర్శప్రాయమైన నిబద్ధతను కనబరిచి,అప్రమత్తంగా ఉంటూ అసురక్షిత పరిస్థితులను నివారించారు. అవార్డు గ్రహీతలలో 02 లోకో పైలట్లు, 04 ట్రాక్
మెయింటెయినర్లు, 01 టెక్నీషియన్, 02 గూడ్స్ ట్రైన్ మేనేజర్లు మరియు 01 స్టేషన్ మాస్టర్ ఉన్నారు. జనరల్ మేనేజర్ అవార్డు గ్రహీతలను అభినందించి, అత్యంత అంకితభావంతో తమ విధులను నిర్వర్తించినందుకు వారినిప్రశంసించారు రైలుకార్యకలాపాలలో భద్రతను నిర్ధారించడానికి ఇతర ఉద్యోగులు కూడా మరింత అప్రమత్తంగా ఉండి, చిత్తశుద్ధితో పనిచేయడానికి ఈ అవార్డులు స్ఫూర్తిని మరియు ప్రోత్సాహాన్ని అందిస్తాయని ఆయన పేర్కొన్నారు.
జనరల్ మేనేజర్ అన్ని విభాగాలలో భద్రతానియమాలను ఖచ్చితంగా పాటించడం పై ప్రాముఖ్యతను ప్రస్తావించారు. కేబుల్ నిర్వహణ, సిగ్నలింగ్ తనిఖీలు మరియు రైలు ఫిట్టింగ్ల వద్ద భద్రతను నిర్ధారించడం వంటి కార్యకలాపాలను అత్యంత శ్రద్ధతో నిర్వహించాలని ఆయనఆదేశించారు లెవెల్ క్రాసింగ్ ల వద్ద భద్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని మరియు విధుల్లో ఉన్న సిబ్బంది అప్రమత్తతను తనిఖీ చేయడానికి క్రమం తప్పకుండా ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆయనఆదేశించారు. జనరల్ మేనేజర్ సురక్షితమైన రైలు కార్యకలాపాలను నిర్ధారించడానికి క్రమం తప్పకుండా భద్రతా డ్రైవ్లు మరియు రాత్రి తనిఖీలునిర్వహించాలని సూచించారు.



