బిజేపి శ్రేణులు సార్వత్రిక ఎన్నికలే లక్ష్యంగా పార్టీ బలోపేతానికి పనిచేయ్యాలని బిజేపిఅధ్యక్షుడు పి.వి. శివా రెడ్డి అన్నారు. తాళ్లూరు మండలంలో పలు గ్రామాలలో శుక్రవారం పర్యటించి పార్టీ బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పలు పథకాలను ప్రజలకు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జి రవిశంకర్, పార్టీ ఉపాధ్యక్షుడు తిండి నారాయణ రెడ్డి, జిల్లా కిసాన్మోర్చా అధ్యక్షుడు ఉన్నం శ్రీనివాస్, ఎస్సీ మోర్చా ప్రధాన కార్యదర్శి ఆంజనేయులు, మండల అధ్యక్షుడు అనుమల కోటేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి సుబ్బా రెడ్డి, సీనియర్ నాయకులు మారం గోవింద రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పుల్లా రావు తదితరులుపాల్గొన్నారు.

