కేంద్ర ప్రభుత్వం మహిళల స్వావలంబనకు ఎన్నో విధాలుగా కృషి చేస్తుందని వానిలో భాగంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో పథకాలను ప్రధాని నరేంద్ర దామోదర్ మోడీ అమలు చేస్తున్నారని ఆ పథకాలను ప్రతి ఒక్కరు తెలుసుకొని వాని ద్వారా లబ్ధి పొందుతూ తమ అభివృద్ధికి మహిళలందరూ బాటలు వేసుకోవాలని భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి పేర్కొన్నారు సింగరాయకొండ మండల బిజెపి ఉపాధ్యక్షులు ప్రసాద్ ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా సోమరాజు పల్లె కాలనీ రైల్వే గేటు వద్ద ఏర్పాటుచేసిన ప్రకృతి సేవ కార్యక్రమంలో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న తీగల సత్యవతి మాట్లాడుతూ మహిళల కోసం కేంద్ర ప్రభుత్వం ఉజ్వల పథకం ద్వారా ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ, మాతృ వందన యోజన పథకం మరియు మహిళలకు పోషకాహారం అంగన్వాడి సెంటర్ల ద్వారా అందించడం ఇలా ఎన్నో విధాలుగా మహిళల స్వావలంబనకు అభివృద్ధికి పథకాలను అమలు చేస్తూ ఉన్నారని తెలిపారు. ఈ సందర్భంగా పది మొక్కలను నాటారు.
భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు మలినేని గీతాంజలి నూతన వ్యాపార ప్రారంభోత్సవంలో పాల్గొని వారి వ్యాపారం దిన దినాభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.
కార్యక్రమంలో బిజెపి మహిళా మోర్చా జిల్లా ఇంచార్జ్ తీగల సత్యవతి దంపతులు, జిల్లా మీడియా ఇంచార్జ్ ధనిశెట్టి రామునాయుడు పావని దంపతులు మరియు ఎస్టీ మోర్చా అధ్యక్షులు ఏలూరు శ్రీనివాసరావు, కే మురళి, ఎం నరేష్ లు ప్రకృతి సేవ లో మొక్కలు నాటారు.


