సనత్ నగర్ నియోజక వర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ,తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ,
ఏ ఐ సీ సీ సభ్యురాలుడా. కోట నీలిమ ఆధ్వర్యంలో సికింద్రాబాద్ పార్లమెంట్ అభ్యర్థి దానం నాగేందర్ ను భారీ మెజార్టీ తో గెలిపించాలని కోట నీలిమ కోరారు.దానం గెలుపు కోసం కవాడిగుడా సోమప్ప మఠం నుండి బన్సీలాల్ పెట్ ప్రాంతం లో భారీ ర్యాలీలో పాదయాత్ర గా వెళ్లి ప్రతి గడప తిరుగుతూ ప్రతి ఓటరు ను కల్సి సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేందర్ ను అత్యంత మెజారిటీతో గెలిపించాలి అని కోరారు. రాష్ర్టంలో 6 గ్యారెంటీ ల అమలు తీరును వివరిస్తూ చేతి గుర్తు కు ఓటు వేయాలి అని కోరారు.ఈ పాదయాత్ర లో సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ముఖ్య నాయకులు ,కార్యకర్తలు పాల్గొన్నారు .

