రాష్ట్రపతి భవన్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో ప్రధాని నరేంద్ర మోడీ భేటీ అయ్యారు. కేంద్ర మంత్రి మండలితో కలిసి ప్రధాని తన రాజీనామాను సమర్పించారు. రాష్ట్రపతి రాజీనామాను ఆమోదించారు మరియు కొత్త ప్రభుత్వం ఏర్పడే వరకు పదవిలో కొనసాగాలని ప్రధానమంత్రి మరియు కేంద్ర మంత్రి మండలిని అభ్యర్థించారు.
