పిట్ట కొంచెం అయినా కూత ఘనం అనేలా తన మనసులో మొదలైన ఆలోచనకు పదును పెట్టిన 9తరగతి చదువుతున్న విద్యార్థి తంగెళ్ళ కేతన్ రాజు రచన మీద మక్కువతో ,, ఎవిల్ నెవర్ విన్స్,,అనే పుస్తకాన్ని రాశాడు.సుధామూర్తి రచనలను ఆదర్శంగా తీసుకున్న కేతన్ రాజు తన మనసులోని ఆలోచనలను
తల్లి మల్లీశ్వరి తండ్రి వెంకట నరసింహరాజు లకు వివరించాడు.వారిద్దరి ప్రోత్సాహం తో ,, ఎవిల్ నేవర్ విన్స్,,అనే పుస్తకాన్ని రాశాడు.ప్రస్తుతం నాగార్జున ఐ ఐ టి ఒలింపియాడ్ లో 9వ తరగతి చదువుతున్నాడు కేతన్ రాజు. సుధానూర్తి రచనలు తనకు పుస్తకం రాయాలి ఆన్న స్ఫూర్తి కలిగించాయని తల్లి,దండ్రులు సహకారం కూడా తొడవడం తో పుస్తకాన్ని రాశానని తన పుస్తకం ,బ్రి బుక్స్,అనే పోర్టల్ లో అందుబాటులో ఉందని ,భవిష్యత్ లో మరిన్ని ఉప యోగకరమైన పుస్తక రచనలు చేస్తానని కేతన్ రాజు తెలియ జేశారు. కేతన్ ప్రతిభను,ప్రోత్సహించిన తల్లి దండ్రులను పలువురు అభినందిస్తున్నారు.


