ప్రజల పక్షాన నిలిచే పత్రిక విశాలాంధ్ర – క్యాలెండర్ ఆవిష్కరణ

పేద, బడుగు, బలహీన వర్గాల సమస్యలను వెలికి తీసి ప్రజా సమస్యల పరిష్కారంలో పత్రికల పాత్ర వెలకట్టలేని దని దర్శి నియోజక వర్గ టిడిపి ఇన్చార్జి గొట్టి పాటి లక్ష్మి, డాక్టర్ లలిత్ సాగర్లు అన్నారు. తాళ్లూరు విశాలాంధ్ర -2025 క్యాలెండర్ను వారు శనివారం ఆవిష్కరించారు. దశాబ్దాల కాలంగా విశాలాంధ్ర పేదల సమస్యల కోసం కృషి చేస్తూ .. ప్రజా ప్రతినిథుల దృష్టికి తీసుకువస్తూ పనిచేయటం అభినందనీయమని అన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని పేదలకు తెలియజేస్తూ.. సమస్యలు పట్ల సానుకూలంగా స్పందించాలని చెప్పారు. కార్యక్రమంలో కార్యక్రమంలో ఎస్సై మల్లికార్జునరావు , మండల టిడిపి పార్టీ అధ్యక్షుడు బొమ్మిరెడ్డి ఓబులు రెడ్డి, ఎంపీపీ తాటికొండ శ్రీనివాస రావు, జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శులు శాగం కొండా రెడ్డి, మానం రమేష్ బాబు, కార్యదర్శి మేడగం వెంకటేశ్వర రెడ్డి, మైనార్టీ సెల్ రాష్ట్ర కార్యదర్శి షేక్ పెద కాలేషా వలి (బడే), నియోజక వర్గ అధ్యక్షుడు షేక్ మీరా మోహినుద్దీన్, తాళ్లూరు యువ నాయుడు ఇడమకంటి శ్రీనివాస రెడ్డి, డిస్ట్రిబ్యూషన్ కమిటి చైర్మన్ తూము శివ నాగి రెడ్డి, సొసైటీ చైర్మన్ గొంది రమణా రెడ్డి (సమర), కైపు రామ కోటి రెడ్డి, కైపు నాగార్జున రెడ్డి, పాశం సూరిబాబు, పిన్నిక రమేష్. యువ నాయకుడు నవులూరు విద్యాసాగర్, సునుం ఆదినారాయణ రెడ్డి, పాలం అంజి రెడ్డి, వంగపల్లి నాగేశ్వర రావు చాట్ల డానీ తదితరులు పాల్గొన్నారు.

WhatsApp Join Now
Telegram Join Now
Youtube Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *