జనతా మెడికల్ ఇన్స్టిట్యూట్ (జిమ్స్ ) ఆధ్వర్యంలో ఎబీసీ
హైస్కూల్ నందు ఆదివారం ఉచిత కంటి వైద్యశిబిరం నిర్వహించారు. ఎంపీటీసీ యామర్తి ప్రభుదాస్ వైద్య శిబిరం ను ప్రారంభించారు. కంటి వైద్య నిపుణులు పూజిత మాదాల ఆధ్వర్యంలో డీఓలు నరసింహారావు, వర్షలు 109 మందికి వైద్య పరీక్షలు నిర్వహించారు. 35 మందికి శుక్లం ఆపరేషన్ కొరకు సిఫార్స్ చేసారు. ఎన్టీఆర్ వైద్య సేవ, ఈ హెచ్ ఎస్ లలో కంటి శక్లాల ఆపరేషన్ నిర్వహించబడునని చెప్పారు. కార్యక్రమంలో కరస్పాండెంట్ టి శ్రీనివాస రెడ్డి, ప్రిన్సిపాల్ కె. వెంకటేశ్వర రావు, డైరెక్టర్ కాలేషా బాబు, పీఆర్.ఓ వందనం, సిబ్బంది గౌస్, గౌస్య లు పాల్గొన్నారు.
