దర్శనాపురి నాటక కళాపరిషత్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం చాలా సంతోషకరమని అన్నారు .
మన సాంప్రదాయాలు, నాగరికత తెలియజేసే కలలు, సంస్కృతిని కాపాడడం లో ఇలాంటి కార్యక్రమాలు.. ఎంతగానో దోహద పడతాయ ని తెలిపారు .
ప్రముఖ సినీ నటులు ఎస్వి రంగారావు గారు, ఎన్టీఆర్ గారు, ఏఎన్ఆర్ గారు, రావుగోపాల రావు గారు మరియు ప్రముఖులు నాటక రంగం ద్వారా సినిమా రంగంలోకి వచ్చినవారని అన్నారు ….
సినిమాలు, టీవీ సీరియల్లు వచ్చిన తర్వాత నాటక రంగానికి కొంత ఆదరణ తగ్గిన మాట వాస్తవమే అని . దర్శి లోని అనేకమంది పెద్దలు, కళారంగం మీద మక్కువతో ఇటువంటి నాటకాలు నిర్వహించడం చాలా సంతోషకరం. హరిచంద్ర నాటకంలో మన దర్శి నియోజకవర్గం, ముండ్లమూరు గ్రామానికి చెందిన కత్తి కోటేశ్వరరావు గారు హరిశ్చంద్రునిగా ఎంతో ప్రఖ్యాతగాంచారు. ఇలా దర్శి ప్రాంతం నుండి అనేకమంది కళాకారులు కవులు కు నిలయం. ఇలాంటి కళాకారులు గడ్డ దర్శి లో నాటకాలను నిర్వహించిన ఈ సందర్భంగా దర్శనాపురి నాటక కళాపరిషత్ ఏర్పాటు చేసిన అందరిని అభినందిస్తున్నాను.
ఈ సందర్బంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు నటసార్వభౌమ విఖ్యత స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారిని ఈ సందర్భంగా స్మరించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది
మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ గారు, ఐటి. విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు రాష్ట్రం కోసం నిరంతరం కష్టపడుతున్నారు. వారి స్పూర్తితో నేను దర్శి నియోజకవర్గాన్ని అభివృద్ధి ప్రంతం గా మార్చాలని సంకల్పం తో కష్టపడుతున్నాను..
అందుకు ప్రజలు, మీలాంటి పెద్దలు సంహరించాలని కోరుచున్నాను. అదేవిదంగా ఇలాంటి నాటకాలు ప్రొచాహించి, కవులకు, కళాకారులకు నావంతు నేను ఎప్పుడు సహాయ సహకారాలు అందిస్తానని తెలియజేస్తున్నాను.
ఈ సందర్బంగా దర్శనాపురి నాటక కళాపరిషత్ వ్యవస్థాపక అధ్యక్షులు కలవకొలను అనంత్ గారు, వారి కమిటీ డా|| లక్ష్మీ గారిని ఘనంగా సన్మానించారు.


