వికే ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపాల్గా వై వేణుగోపాల్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇక్కడ పనిచేస్తున్న కొండ పల్లి ఆంజనేయులు పదవీ విరమణ చేయటంతో ఆయన స్థానంలో మ్యాథ్స్ లెక్చరర్ గా పని చేస్తున్న వేణుగోపాల్ కు ఎఫ్. ఏ సి అప్పగించారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి అధ్యాపక, అధ్యాపకేత బృందం ఎంతో పనిచేసారని, గత ప్రిన్సిపాల్ ప్రొత్సహంగా కళాశాల అభివృద్ధి పథంలో వచ్చిందని, అందరి సహకారంతో అది కొనసాగిస్తానని చెప్పారు. అధ్యాపక, అధ్యాపకేతర బృందం లక్ష్మయ్య, రాజశేఖర్, గురవయ్య, సాయి లక్ష్మి దేవి, వెంకటేశ్వర్లు, లలితా బోన్, శంకరమ్మ, నూది సుబ్బరామయ్య, శేషగిరి, బ్రహ్మా రెడ్డి, శ్యామ్సన్, జయపాల్లు వేణుగోపాల్ను ఘనంగా సన్మానించారు.
