పొట్ట దశలో ఉన్న మొక్కజొన్న పంటకు ప్రతి మూడు రోజులకు ఒక సారి తగిన మోతాదులో నీరు అందించాలని దర్శి టెక్నికల్ అధికారి టి వెంకటేశ్వర్లు చెప్పారు. తాళ్లూరు-2, కొర్రపాటి వారి పాలెంలలో మంగళవారం పొలం పిలుస్తుంది నిర్వహించారు. ప్రస్తుత వాతావరణ పరిస్థితులలో మొక్కజొన్న సక్రమంగా విత్తు పట్టటం లేదని వ్యవసాయ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. కండె పట్టు దశలో ప్రతి నాలుగు లేదా ఐదు రోజులకు 5 మి.మీల నీటిని అందించాల్సి ఉంటుందని వ్యవసాయాధికారి ప్రసాద రావు వివరించారు. వాతావరణ ప్రతికూలత వలన గింజ సక్రమంగా పట్టనట్లు గుర్తించినట్లు వ్యవసాయాధికారి చెప్పారు. ఎఈఓ కె సుబ్బా రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
