ముండ్లమూరు( మండలంలోని భీమవరం గ్రామంలో శ్రీ సీతా సమేత కోదండ రామస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో దర్శి వైయస్సార్సీపి నాయకులు మద్దిశెట్టి శ్రీధర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సీతా సమేత రామ్ కోదండ రామస్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. ఆలయ పూజారులు, గ్రామస్తులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో ఎంపీపీ సుంకర సునీత బ్రహ్మానందరెడ్డి, వైస్ ఎంపీపీ వేముల పద్మావతి జానకి రామయ్య, భీమవరం గ్రామ సర్పంచ్ అన మలమూరి సుజాత వెంకటరావు, వైసీపీ మండల యువ నాయకులు బిజ్జం వెంకటసుబ్బారెడ్డి, ముళ్ళమూరు సొసైటీ అధ్యక్షులు అంబటి వెంకటేశ్వర రెడ్డి, ఉల్లగల్లు సర్పంచి జనమాల నాగేంద్ర పిచ్చయ్య, తదితరులు పాల్గొన్నారు.



