పదవ తరగతి పరీక్షా ఫలితాల్లో దర్శి లోని కిజీజీ స్కూల్ అసాధారణ మార్కులు కైవసం చేసుకుని దర్శి పేరును రాష్ట్ర వ్యాప్తంగా మారు మ్రోగెలా చేసింది…దర్శి చరిత్ర లోనే ఇప్పటి వరకు ఎరుగని మార్కులు సాధించి రాష్ట్రం లోనే నెంబర్ వన్ స్కూల్ గా పేరుపొందింది. 600 లకు గాను 597 మార్కులు సాధించి హిస్టరీ క్రియేట్ చేసింది. లక్షలకు లక్షలు ఫీజులు వసూలు చేసే కార్పొరేట్ స్కూల్లు సైతం దర్శి వైపు చూసేలా చరిత్రను సృష్టించిన ఘనత దర్శి కిజిజి స్కూల్ కు దక్కింది. టౌన్ ఫస్ట్, జిల్లా ఫస్ట్, స్టేట్ ఫస్ట్ మార్కులు సాధించి దర్శి పేరును రాష్ట్రం నలుమూలలా వినిపించేలా చేసింది. ఇంతటి మంచి మార్కులతో పాటు రాష్ట్ర ఘనత సాధించిన దర్శి కి చెందిన ఊరిబిండి మధు, అంజలీల కుమారుడు అజయ్ జస్వంత్ కుమార్ కు కిజిజి స్కూల్ యాజమాన్యానికి, పాఠశాల ఉపాధ్యాయులకు, విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హృదయపూర్వక అభినందనలు శుభాకాంక్షలు.
పదవ తరగతి ఫలితాలలో స్టేట్ ఫస్ట్ కైవసం చేసుకున్న దర్శి కిజిజీ స్కూల్ విద్యార్థి.
06
May