ప్రకాశం జిల్లా దర్శి నియోజక వర్గంలోని దర్శి మండలం రామచంద్రాపురం గ్రామ సర్పంచి బాదం ధనలక్ష్మి (44) ఆదివారం ఆత్మహత్యకు పాల్పడినది. ఎక గ్రీవ సర్పంచిగా ఎన్నికైన ధనలక్ష్మి ఆత్మహత్యకు పాల్పడడం తీవ్ర చర్చాంశనీయమైనది. ఆమెకు భర్త చిన్ని రెడ్డి, కుమారుడు, కుమార్తె ఉన్నారు. కుమారుడు పశువైద్యునిగా ప్రవేట్ గా పనిచేస్తున్నాడు. కుమార్తె కూడ చదువు పూర్తియినది. ఈ సమయంలో సర్పంచి ఆత్మహత్యకు పాల్పడటం అటు కుటుంబసభ్యులను, ప్రజలను తీవ్రంగా కలచి వేసినది.
ప్రకాశం జిల్లా దర్శి మండలం రామచంద్రాపురం వైఎస్సార్సీపీ ఎకగ్రీవ సర్పంచి ధనలక్ష్మి ఆత్మహత్య – శోక సంద్రంలో ప్రజలు
07
May