పంట మార్పిడి అవలంబించి అధిక దిగుబడులు సాధించాలని సహపరిశోధనా సంచాలకులు డాక్టర్ జీఎమ్వీ ప్రసాదరావు సూచించారు. దర్శి కృషి విజ్ఞాన కేంద్రంలో ఐకార్ 95వ వ్యవస్థాపక దినోత్సవం పురస్కరించుకుని సాంకేతిక వారోత్సవాలు మంగళవారం ఘనంగా నిర్వహించారు. కంది ఎఆర్డీ 105 విత్తనాలు, టార్పాలిన్ పట్టలు, స్ప్రేయర్లు ఉచితంగా పంపిణీ చేశారు. కెవికె కోఆర్డినేటర్
డాక్టర్ ఎన్ .వి.వి. ఎస్ దుర్గాప్రసాద్, డాక్టర్ ఎం. ఉష, డాక్టర్ ఎం. శివ, డాక్టర్ టీవీ రెడ్డి, డాక్టర్ జాహ్నవి, డాక్టర్ లీలాకృష్ణ, టి. మానస తదితరులు పాల్గొన్నారు.

